PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆధారాలు ఉంటే నిరూపించు లోకేష్

1 min read

– స్క్రిప్టు చదివి నిజాలు తెలుసుకోకుండా మాట్లాడితే ప్రజలు నమ్ముతారా..
– పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి..
పల్లెవెలుగు వెబ్ కల్లూరు: అధికారంలో రావాలంటే ప్రజలకు అబద్ధాలు చెబితే నీ టిడిపి పార్టీకి నీకు ఓట్లు వేస్తారా గ్రామ శివారులలో డేరాలు వేసుకొని స్థానిక నాయకులు రాసిచ్చిన స్క్రిప్టు చదవడం అబద్దాలను నిజాలుగా చెప్పడం నీకే చెల్లిందని శనివారం నాడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు పెద్దపాడు బహిరంగ సభలో నారా లోకేష్ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పై అవినీతి ఆరోపణలు చేయడం దీనికి కౌంటర్ గా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే మాట్లాడుతూ నా రాజకీయం అనుభవంతో లేదు నీకు వయసు ఏం మాట్లాడుతున్నావ్ అంటూ అవాకుల చెవాకులు పేలితే ఊరుకునేది లేదని గతంలో టిడిపి పార్టీ హయాంలో జన్మభూమి కమిటీలు నీరు చెట్టులో నీ వాటా ఎంత అని లోకేష్ ని నిలదీశారు మైనార్టీలకు మోసం చేసింది మీ టిడిపి నాయకులేనని ముజఫర్ నగర్ లోని ముస్లిం మైనార్టీ వక్ఫ్ బోర్డు కు చెందిన భూమి 10 ఎకరాలను కబ్జా చేసి వెంచర్ వేసి ప్రభుత్వ భూమిని అమాయకులకు కట్టబెట్టినది మీ టిడిపి నాయకులు కాదా అని ప్రశ్నించారు తాను ఎమ్మెల్యే గా గెలిచాక ముస్లిం సోదరులు వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతమైనాయని తన వద్ద ఫిర్యాదు చేస్తే స్వయంగా కలెక్టర్ వద్ద తీసుకువెళ్లి ముస్లిం సోదరులకు న్యాయం చేసి మిగతా స్థలాన్ని కంచే వేసి మసీదు కట్టిన విషయం అందరికీ తెలుసన్నారు దీనిపై నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని ముస్లిం సోదరులు నేను బహిరంగ చర్చకు సిద్ధమని నారా లోకేష్ కి సవాల్ విసిరారు గ్రావెల్ తవ్వకాల పై అవాకులు చివాకులు పేలావని అసలు రాయలసీమలో అభివృద్ధి గురించి నీకేమైనా అవగాహన ఉందా అని ఎద్దేవ చేశారు అవినీతి చేసి ఉంటే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచే వాడిన నాకు నువ్వు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు నా నియోజకవర్గ ప్రజలు నాపై నమ్మకం ఉంచి భారీ మెజార్టీతో గెలిపించారు వెలగమాను గురించి మాట్లాడావ్ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నవారు కూడా ఇదే వెలగమాను గురించి మాట్లాడి హామీ ఇచ్చారు మరి వాళ్ళు మాట మీద నిలబడ్డారా త్వరలోనే వెలగమాను డాం మొదలుపెట్టి నువ్వు తప్పని నిరూపిస్తా. పూర్తిస్థాయిలో నిజాలు తెలుసుకోకుండా రాష్ట్రస్థాయి నాయకుడు అంటూ చెప్పుకునే నువ్వు గల్లి స్థాయి లీడర్ మాట్లాడే మాటల కంటే హీనంగా మాట్లాడావ్ నా గురించి కేసి రైతులకు అడుగు. నువ్వు పాదయాత్ర అంటూ నాలుగు గంటలు తిరిగి గొప్పలు చెప్పుకుంటున్నావు నేను ప్రతిరోజు నా నియోజకవర్గ ప్రజల వద్దకు పాదయాత్ర చేస్తూనే ఉంటాను అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత నీకు నీ నాయకులకు లేదు అంటూ హెచ్చరించారు ఈసారి కూడా వైసిపి పార్టీ టికెట్ పై పాణ్యం నుంచి పోటీ చేసి భారీ స్థాయిలో ఎమ్మెల్యేగా గెలిచి లోకేష్ నీకు నీ అనుచరులకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ సవాల్ విసిరారుఈ సమావేశంలో కర్నూలు నగర మేయర్ బీవై.రామయ్య, కర్నూల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మీది వేముల ప్రభాకర్ రెడ్డి. ఎంపీపీ హుస్సేన్ బి. ఎంపీపీ నాగమద్దమ్మ. జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి.. కార్పొరేటర్ శ్వేతా రెడ్డి. నగరంలో పలువురు కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు,వైఎస్సార్ సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author