PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇండియాను ఓడిస్తే.. అతన్ని పెళ్లి చేసుకుంటా !

1 min read

పల్లెవెలుగువెబ్ : టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో పాకిస్థాన్ నటి సెహర్ షిన్వారీ ఆసక్తికర ట్వీట్ చేశారు. పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే ఆదివారం జరిగే మ్యాచ్ లో జింబాబ్వే చేతిలో టీమిండియా ఓడిపోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, సెహర్ షిన్వారీ స్పందిస్తూ… టీమిండియాను జింబాబ్వే ఓడిస్తే, తాను జింబాబ్వే దేశస్తుడ్ని పెళ్లాడతానని ప్రకటించారు. నిన్న టీమిండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియానే నెగ్గింది. దాంతో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలోనే సెహర్ షిన్వారీ పైవిధంగా స్పందించారు.

About Author