PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అలా చేస్తే బ‌స్సుల్లోంచి దింపేయండి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : త‌మిళ‌నాడు ర‌వాణ శాఖ సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిని అక్కడికక్కడే దింపేయాలని రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ బస్సుల్లో మహిళా ప్రయాణికులకు మరింత రక్షణ కల్పించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం.. కాస్తంత కఠిన నిబంధనల్నే అమల్లోకి తెచ్చింది. ఇప్పటికే సాధారణ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వం.. వారి రక్షణ, భద్రత కోసం బస్సుల్లో సీసీ టీవీ కెమెరాలు, ఎమర్జెన్సీ బెల్‌ తదితరాలు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో, మహిళలకు మరింత భద్రత కల్పించేలా రవాణాశాఖ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది.

                              

About Author