PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్తే కండువా వేశారు..

1 min read

– మేం వైసిపి పార్టీలో చేరలేదు.
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : బంధువుల పని నిమిత్తం ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్తే మా మెడలో కండువా వేశారని పత్తికొండ పట్టణ చాకలి వీధికి చెందిన టీడీపీ కార్యకర్తలు అన్నారు.తాము వైసీపీలో చేరినట్లు ఫోటో తీసి  సోషల్ మీడియాలో  కథనాలు ఇచ్చారని తెలిపారు. మేము తెలుగుదేశం కార్యకర్తలం, మేము వైసీపీ పార్టీలో చేరలేదంటూ, పత్తికొండ పట్టణం చాకలి విధికి చెందిన  చెవుల సూరి, అంజి, నరసింహ, విజయ్ లు స్పష్టం చేశారు. టిడిపి కార్యాలయంలో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. సమీప బంధువులు ఎమ్మెల్యే ని కలిసినందుకు వెళ్తూ, అక్కడే బేల్దారి పనులు చేస్తున్న తమను వెంట రావాలని కోరడంతో 10మందిమి వెళ్లడం జరిగింది అన్నారు. అక్కడ కండువాలు వేస్తుంటే ఇదేంటని ప్రశ్నించామని, ఎమ్మెల్యేను కలిసేటప్పుడు ఇలాంటివి సాధారణమని చెప్పారని అన్నారు. అలా ఎమ్మెల్యేతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియా,  మీడియాలో పెట్టి వైసీపీ లోకి చేరిన యువకులంటూ ప్రచారం చేశారన్నారు. తమ మొదటి నుంచి టిడిపి కార్యకర్తలం అని ఎప్పటికీ టిడిపి కార్యకర్తల మేనని, పనిమీద ఎమ్మెల్యే ని కలిసిన వారికి ఇలా కండువాలు వేసి పార్టీలో చేరాలని ప్రచారం చేయడం దారుణం అన్నారు. మేము ఎప్పటికీ టిడిపి కార్యకర్తలమేనని మా నాయకుడు కెఈ శ్యాంబాబు అని, ఆయన గెలుపుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

About Author