PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌ర్మిష‌న్ లేకుండా వెళితే.. రూ. 10 వేల జ‌రిమానా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అనుమతి లేకుండా గోవాకు వెళ్లినందుకు కర్ణాటక ప్రయాణికులకు పోలీసులు రూ.10,000 జరిమానా విధించారు. గుడ్ ఫ్రైడే, లాంగ్ వీకెండ్ సందర్భంగా ప్రత్యేక అనుమతి లేకుండా గోవాకు వెళ్లిన కర్ణాటక పర్యాటకులకు రూ.10,262 జరిమానా విధించారు. హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం గోవాకు వెళ్లే మార్గంలో దాదాపు 40 ట్యాక్సీలను నిలిపివేసి జరిమానా విధించారు. లాంగ్ వీకెండ్‌లో ఆర్‌టీఓ కార్యాలయాలు మూతపడడంతో డ్రైవర్లు ప్రత్యేక అనుమతి పత్రాన్ని పొందలేకపోయారని తెలుస్తోంది.

                                     

About Author