PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ల‌క్ష పెట్టుబ‌డి పెడితే.. ఏడాదికి 9 ల‌క్షల లాభం !

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్ : నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్ ఇండియా. మిడ్ క్యాప్ షేర్ గా బీఎస్ ఈ లో ట్రేడ్ అవుతోంది. ప్రముఖ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ లోధా గ్రూప్ కి చెందిన స‌బ్సిడ‌రీ కంపెనీ ఈ నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్ ఇండియా. గ‌త ఏడాది సెప్టంబ‌ర్ 9న ఈ షేరు విలువ 298.60 రూపాయాలు మాత్రమే. ఈ సంవ‌త్సరం సెప్టంబ‌ర్ 9 నాటికి ఈ షేరు విలువ 2,969.25 రూపాయ‌ల వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. 52 వారాల గరిష్ట ధ‌ర 3820. గ‌త ఏడాది సెప్టంబ‌ర్ 9న ఎవరైన ల‌క్ష రూపాయ‌లు ఈ కంపెనీలో పెట్టుబ‌డి పెట్టి ఉంటే.. స‌రిగ్గా ఈ ఏడాది సెప్టంబ‌ర్ 9 నాటికి 9.94 ల‌క్షల లాభం వ‌చ్చేది. ఆగ‌స్టు 27 న ఈ కంపెనీ షేరు విలువ జీవిత‌కాల గరిష్టాల‌కు చేరుకోవ‌డంతో అమ్మకాలు మొద‌ల‌య్యాయి. దీంతో ప్రస్తుతం షేరు ధ‌ర 2,969 రూపాయల వ‌ద్ద ట్రేడ్ అవుతోంది.

About Author