PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నల్లా తిప్పితే నీళ్లకు బదులు లిక్కర్

1 min read

పల్లెవెలుగువెబ్ : తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన యత్నం, మునుగోడు ఉప ఎన్నికలపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల గురువారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికను డబ్బుతో గెలవాలనుకుంటున్న ప్రధాన పార్టీలు…ఓటర్లను భారీ ఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలోనే మునుగోడులో నల్లా తిప్పితే నీళ్లకు బదులుగా లిక్కర్ వస్తోందని ఆమె ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేయకుండా బహిష్కరించాలని ఆమె పిలుపునిచ్చారు.

About Author