PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘కర్ఫ్యూ’లో బయటకు రావాలంటే.. ‘ ఈపాస్​’

1 min read

ఎస్పీ, కమిషనర్ల అనుమతి తప్పనిసరి
– ఏపీ డీజీపీ గౌతమ్​ సవాంగ్​ స్పష్టత
పల్లెవెలుగు వెబ్​: కర్ఫ్యూ సమయంలో అత్యవసర పని నిమిత్తం బయటకు వెళ్లే వారు తప్పనిసరిగా ఈపాస్​ తీసుకోవాలని, ఏ అవసరం మీద వెళ్తున్నారో చెప్పి ఎస్పీ, కమిషనర్లతో అనుమతి పొందాలని ఏపీ డీజీపీ గౌతమ్​ సవాంగ్​ స్పష్టం చేశారు. ఈ నిబంధన సోమవారం నుంచి వర్తిస్తుందన్నారు. కొత్త నిబంధనలు వచ్చేంత వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్న ఆయన… అంతర్రాష్ట్ర రాకపోకలపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ అవసరమైతే తప్పా బయటకు రావొద్దని, మాస్క్​ ధరించి, శానిటైజర్​ వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఫిర్యాదు చేయాలనుకున్న వారు నేరుగా పోలీస్​ స్టేషన్​కు రాకుండా అందుబాటులో ఉన్న ఏపీ పోలీస్​ సేవ అప్లికేషన్​ సౌకర్యం వినియోగించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు 144 సెక్షన్​ అమలులో ఉంటుందన్నారు. సభలు, సమావేశాలకు అనుమతి లేదు.

About Author