PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జొహరాపురంలో..ఇఫ్తార్​ విందు

1 min read

కర్నూలు, పల్లెవెలుగు: నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదరుల అభ్యన్నతికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు వైసీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఎ.ఎండి ఇంతియాజ్​. ఆదివారం నగరంలోని 18వ వార్డు జొహరాపురం నందు వైయస్సార్సిపి సీనియర్ నాయకులు జిలాని ఆహ్వానం మేరకు ఇఫ్తార్ విందులో  కర్నూలు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి A.Md. ఇంతియాజ్, కర్నూలు మాజీ ఎమ్మెల్యే S.V.మోహన్ రెడ్డి గారు, పాణ్యం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఎ.ఎండి ఇంతియాజ్​ మాట్లాడారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author