NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

న్యాయ‌వ్య‌వ‌స్థ పై నిర్ల‌క్ష్యం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. న్యాయ‌వ్య‌వస్థ పై ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని వ్యాఖ్యానించారు. బెజవాడలో కోర్టు నిర్మాణం పూర్తి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నామని, ప్రభుత్వాలు మారినా బిల్డింగ్ నిర్మాణం పూర్తికాలేదన్నారు. త్వరలో తానే వచ్చి కోర్టు బిల్డింగ్‌ ప్రారంభిస్తానని ఆశిస్తున్నానని తెలిపారు. న్యాయవ్యవస్థను మొదటి నుంచి చిన్నచూపు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముద్దాయికి శిక్షపడాలనే ఆలోచించేలా పబ్లిక్ ప్రాసిక్యూషన్ వ్యవస్థ ఉందని, పబ్లిక్ ప్రాసిక్యూషన్‌ వ్యవస్థ ప్రక్షాళన జరగాలని ఎన్వీ రమణ ఆకాంక్షించారు.

                                       

About Author