PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమాలు వెలుగులోకి వస్తాయనే కేసులు !

1 min read

పల్లెవెలుగువెబ్ : విశాఖలో అక్రమాలు, తప్పుడు వ్యవహారాలకు పాల్పడుతున్నది ఎవరో నగర ప్రజలకే కాకుండా, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని పవన్ పేర్కొన్నారు. ఈ వాస్తవాలు మరింతగా వెలుగులోకి వస్తాయనే జనసేన నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే, జనసేన చేపట్టిన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు విశాఖ ఎయిర్ పోర్టులో ప్రభుత్వ ప్రాయోజిత డ్రామా సృష్టించారని వివరించారు. అక్కడి ఘటనల్లో తమ పార్టీ నేతలు, వీర మహిళలను, జనసైనికులను ఇరికించారని తెలిపారు. నియమనిబంధనలకు నీళ్లొదలి అరెస్టులకు పాల్పడ్డారని, మహిళలని కూడా చూడకుండా అర్థరాత్రి వేళ అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

About Author