NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్రమంగా ఇంటి నిర్మాణం… వ్యక్తిపై చర్యలు తీసుకోండి…

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని నాగలూటి,పైపాలెం గ్రామాల మధ్యలో గట్టు పైన ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపడుతున్న ఇంటిని పనులను నిలిపివేయాలని కోరుతూ పైపాలెం గ్రామానికి చెందిన ప్రజలు తహసిల్దార్ ఎస్.ప్రకాష్ బాబుకు వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నందికొట్కూరు పట్టణానికి చెందిన యాకోబు అనే వ్యక్తి సర్వే నంబర్ 177లో గట్టు పైన ఒక ఎకరా పొలంలో ఎబినేజరే మినిస్ట్రీస్ వారు యాకోబు అనే అతను ఉపాధి కుట్టు శిక్షణ కొరకు మరియు వృద్ధాశ్రమం ఏర్పాటు చేయుట కొరకు ఆయన ఇక్కడ ఇంటి నిర్మాణం చేపట్టారని ఆ పనులు వెంటనే నిలిపివేయాలని గ్రామానికి చెందిన వెంకటయ్య,నాగేశ్వరరావు,టి.రాముడు, ఎం.వెంకటయ్య,లిల్లీ సాహెబ్ తదితర 30 మంది ప్రజల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ కు అందజేస్తూ పనులు నిలిపివేయాలని ప్రజలు కోరారు.అదేవిధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టిన వ్యక్తి యాకోబుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు తహసిల్దారును కోరారు.ఈ విషయమై మండల తహసిల్దారును వివరణ కోరగా పనులను వెంటనే నిలిపివేస్తామని తహసిల్దార్ అన్నారు.

About Author