PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాతీయ రాజ‌కీయాల్లోకి మ‌మ‌త !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : జాతీయ రాజ‌కీయాల్లోకి మ‌మ‌త అడుగుపెట్టనున్నారా ? అంటే.. అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఆమె ఢిల్లీ ప‌ర్యట‌న‌కు ఒక‌రోజు ముందు కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. టీఎంసీ పార్లమెంట‌రీ పార్టీ చైర్ ప‌ర్సన్ గా మ‌మ‌తా బెన‌ర్జీని ఎన్నుకున్నారు. దీంతో ఆమె జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర షోషించ‌నున్నార‌నే విష‌యం స్పష్టమైంది. డిల్లీ ప‌ర్యట‌న‌లో ఆమె వివిధ పార్టీల నాయ‌కులతో భేటీ కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తో కూడ ఆమె భేటీ కానున్నారు. టీఎంసీ కి లోక్ స‌భ‌లో 22 మంది ఎంపీలు, రాజ్యస‌భ‌లో 11 మంది ఎంపీలు ఉన్నారు. మ‌మ‌తా బెన‌ర్జీ 7 సార్లు ఎంపీగా గెలిచారు. మూడోసారి సీఎంగా ప‌నిచేస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీతో హోరాహోరీగా పోరాడి విజ‌యం సాధించారు. ఆమె అనుభవాన్ని పార్లమెంటులో ఉప‌యోగించుకోవాల‌ని ఆ పార్టీ పార్లమెంట‌రీ క‌మిటీ నిర్ణయించింది.

About Author