NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్వో ప్లాంట్ ను పరిశీలించిన డిఈ అమల

1 min read

– 2 లక్షల 50 వేల నిధులు మంజూరు 

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆర్డబ్ల్యూఎస్ డీఈ అమల పరిశీలించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గత మూడు నెలల కిందట నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నిధులతో ఆర్వో ప్లాంట్ పునరుద్ధరణ పనులు చేయించడం జరిగిందని ఇప్పుడు మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మతుల పనులు(ఫ్లోరింగ్,రంగులు వేయించడం,రేకులు వేయుట కొరకు)2 లక్షల 50 వేల రూ.ల నిధులు మంజూరు అయ్యాయని ఈపనులు త్వరితగతిన పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మండల ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విశ్వనాథ్ కు ఆమె సూచించారు.ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఫరీద్ అహ్మద్ పాల్గొన్నారు.

About Author