PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ‌రిమానా విధించింద‌ని.. ఎస్సై గొంతు కోశాడు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మద్యం మత్తులో వాహనం నడిపిన తనకు దేహశుద్ధి చేయడమే కాకుండా జరిమానా విధించిన మహిళా ఎస్‌ఐపై వాహనదారుడు కక్ష కట్టాడు. భద్రతా విధులలో ఉన్న ఆమెను వెంటాడాడు. పథకం ప్రకారం గొంతు కోసి తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులకు చిక్కాడు. త‌మిళ‌నాడులోని తిరునల్వేలి జిల్లా సుత్తమల్లి పోలీస్‌ స్టేషన్‌లో మార్గెడ్‌ థెరిసా మహిళా యువ ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి పలవూరు గ్రామంలో జరిగిన ఆలయ ఉత్సవాల భద్రతకు ఆమె వెళ్లారు. రాత్రి సమయంలో విధుల్లో ఉన్న ఆమెపై ఓ వ్యక్తి దాడి చేశాడు. కత్తితో గొంతు కొసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. స్థానికులు, విధుల్లో ఉన్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ థెరిసాను ఆస్పత్రికి తరలించారు. ఆమెకు తిరునల్వేలిలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

                                     

About Author