PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆకట్టుకున్న అంబరీషోపాఖ్యానం

1 min read

పల్లెవెలుగు, వెబ్ తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీలలితా పీఠంలో గత మూడు రోజుల నుండి నిర్వహిస్తున్న కార్తిక మాస ధార్మిక సప్తాహ‌‌‌ కార్యక్రమంలో భాగంగా మూడవరోజు పసుపులేటి నీలిమ చేసిన అంబరీషోపాఖ్యానం భక్తులను ఎంతగానో అలరించింది . భగవద్భక్తి ముందు ఎంతటి శక్తి యైనా తక్కువే అనేటటువంటి సందేశాన్నిస్తూ అంబరీషుడు తన ఏకాదశి ఉపవాస దీక్ష చేత శ్రీమన్నారాయణుడిని మెప్పించి నటువంటి సంఘటనను చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో లలితా పీఠం పీఠాధిపతి మేడా సుబ్రహ్మణ్యం స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యనిర్వాకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author