PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంక్షోభంలో ఇమ్రాన్.. ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ రాజ‌కీయ సంక్షోభంలో ప‌డ్డారు. గత వారం పాకిస్థాన్‌ పార్లమెంట్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఏ క్షణమైనా ఓటింగ్‌ జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, గురువారం ఇ‍మ్రాన్‌కు షాకిస్తూ ఎంపీలు, మం‍త్రులు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. 24 మంది ఎంపీలు, ముగ్గురు మం‍త్రులు రాజీనామా చేయడంతో పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం అవిశ్వాస తీర్మాణం నెగ్గాలంటే 172 సీట్ల మెజార్టీ నిరూపించుకోవాలి. కాగా, దిగువ సభలో ప్రభుత్వానికి 155 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు నాలుగు మిత్రపక్షాలతో కలిసి 175 సీట్లను ప్రభుత్వం కలిగి ఉంది.

                             

About Author