PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

2024 లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి..

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  అఖిలభారత కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు గారి ఆదేశాల ప్రకారం మరియు కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎం సుధాకర్ బాబు  ఆదేశాలతో ఈరోజు మండల స్థాయి కాంగ్రెస్ సమావేశం ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఆలూరు తాలూకు మైనార్టీ విభాగి ఇంచార్జ్ ఎం అమానుల్లా మాట్లాడు తో 2024 సంవత్సరంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడమైనది అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్లో ఆటో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఆంధ్రప్రదేశ్కి మొదటి సంతకం ప్రత్యేక హోదాపై సంతకం చేస్తారని కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అదే కాకుండా రైతులుకు రైతు రుణాలు మాఫీ మరియు 500 కే గ్యాస్ సిలిండర్ మరియు నిరుపేదలకు ప్రతినెల 6000 సహాయం ఇవ్వడం జరుగుతుందని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది కనుక రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి విజయం ఖచ్చితంగా అవుతుందని ఆమానుల్లా ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏం ఖలీల్. సిద్దయ్య. పరసప్ప. హుస్సేన్ అప్ప మంకాలమ్మ. లచ్చిమి. సిద్ధమల్లా. వీరేష్. గోపాల్. గురవయ్య తదితరులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

About Author