PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బద్వేల్​బరిలో..15మంది!

1 min read

పల్లెవెలుగువెబ్​, కడప: ఏపీలోని కడప జిల్లా బద్వేల్​ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల బరిలో 15మంది అభ్యర్థులు ఉన్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈమేరకు బుధవారం నాటికి అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయింది. దీంతో ఉప ఎన్నిక పోటీలో 15మంది అభ్యర్థులు మిగిలారు. మొత్తం 27మంది నామినేషన్లు వేయగా పరిశీలనలో 9మంది నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. దీంతో బరిలో 15మంది అభ్యర్థులు నిలిచారు. ఇందులో ప్రధానంగా వైసీపీ అభ్యర్థి డాక్టర్​ సుధా, బీజేపీ అభ్యర్థి సురేస్​, కాంగ్రెస్​ అభ్యర్థి కమలమ్మ పోటీలో ఉన్నారు. బద్వేల్​ ఉప ఎన్నిక ఈనెల 30న జరుగనుండగా నవంబర్​ 2న ఫలితాలు వెలువడనున్నాయి.

About Author