PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చెన్నూరులో… దాతలకు ఘనసన్మానం

1 min read

పల్లెవెలుగువెబ్​, చెన్నూరు: మానవతా సంస్థకు ఉచితంగా శాంతి రథం అంబులెన్సు బాడీ ఫ్రీజర్లలు అందజేసిన చింతకుంట వెంకటరమణారెడ్డి. గోసుల జనార్దన్ రెడ్డి. పెడబల్లి ప్రభాకర్ రెడ్డి. నామ రత్నయ్య శెట్టి లను చెన్నూరు మానవతా సంస్థ కమిటీ సభ్యులు సోమవారం ఘనంగా సన్మానించారు. చెన్నూరు శ్రీ నాగ మల్లేశ్వర దేవస్థానంలో మానవతా సంస్థ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. చెన్నూరు రెడ్డి గారి వీధికి చెందిన చింతకుంట వెంకటరమణారెడ్డి ఐదు లక్షలు విలువచేసే శాంతి రధమును మానవతా సంస్థకు ఉచితంగా అందజేశారు.  చెన్నూరు రెడ్డి గారి వీధికి చెందిన గోసుల జనార్దన్ రెడ్డి అంబులెన్స్ ను ఉచితంగా అందజేశారు. చెన్నూరు కు చెందిన పెడబల్లి ప్రభాకర్ రెడ్డి. నామ రత్నమయ్య శెట్టి ఇద్దరు ఒకటి చొప్పున బాడీ ఫ్రీజర్ లు ఉచితంగా అందజేశారు. మానవతా సంస్థకు సహాయం చేసిన వీరిని ఘనంగా శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

About Author