PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చింతలపల్లిలో డాక్టర్ సుధీర్ కు జన నీరాజనం

1 min read

జగనన్న ప్రభుత్వం..పేదల ప్రభుత్వం

నన్ను గెలిపించాలని ఓటర్లకు డాక్టర్ సుధీర్ అభ్యర్థన

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: జగనన్న ప్రభుత్వం పేదల ప్రభుత్వమని పేద ప్రజల కోసమే సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చారని నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ధార సుధీర్ అన్నారు.గురువారం సా.4 గంటలకు నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కాజీపేట, చింతలపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు.చింతలపల్లిలో డాక్టర్ సుధీర్ కు ప్రజలు మరియు మహిళలు బ్రహ్మరథం పట్టారు.ఆయన గ్రామాల్లో ఉన్న ప్రతి గడప గడపకూ వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా..ప్రభుత్వ సంక్షేమ పథకాలు మళ్ళీ కొనసాగాలన్నా జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని అప్పుడే గ్రామాలు సస్యశ్యామలం అవుతాయంటూ వైకాపా ప్రభుత్వాన్ని మీ ఓటుతో అధికారంలోకి తెచ్చే బాధ్యత మీ చేతుల్లోనే ఉందని మహిళలు వృద్ధులతో ఆయన మంచిగా పలకరిస్తూ మీ ఓటు నాకే వేయాలని ఆయన ఓటర్లతో అన్నారు.గ్రామ వైసీపీ నాయకులు ఎల్లంపల్లి పుల్లారెడ్డి,యువ నాయకులువై తిరుమల్ రెడ్డి స్వగృహంలో డాక్టర్ సుధీర్ ను శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు.ఆయన వెంట గ్రామ ప్రజలు ఉత్సాహంగా ముందుకు నడిచారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి,ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాట ఓబులేష్,గ్రామ వైసీపీ నాయకులు ఎంపీటీసీ నాగేశ్వర రెడ్డి,మల్లేశ్వర రెడ్డి,శేశి రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి,ఐటీ వింగ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ తువా చిన్న మల్లారెడ్డి,జిల్లా కమిటీ సభ్యులు కె.రాముడు,జెసిఎస్ మండల కన్వీనర్ రవికుమార్, చిన్న రామచంద్రారెడ్డి,పి సాంబశివుడు తదితరులు పాల్గొన్నారు.

About Author