PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డీఎస్పీ ప్రమోషన్లలో సొంత సామాజిక వర్గానికే పెద్దపీట

1 min read

పల్లెవెలుగువెబ్ : డీఎస్పీ ప్రమోషన్లలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారని టీడీపీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఈ మేరకు బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీల ప్రమోషన్లపై కీలక వివరాలు వెల్లడించారు. మంగళవారం 53 మంది డీఎస్పీలకు పోస్టింగ్‌ వేయగా, అందులో 25% మంది జగన్ సొంత సామాజికవర్గం వారే ఉన్నారన్నారు. 29 సబ్‌ డివిజన్లలో 19 మంది జగన్ సొంత కులం వారే ఉన్నారన్నారు. ఒక్క కాపుకు కూడా పోస్టింగ్‌ ఇవ్వలేదన్నారు. ప్రముఖ పట్టణాల్లో ఒక్క బీసీకి, ఎస్సీకి గానీ పోస్టింగ్‌ లేదన్నారు. ప్రతి ప్రాంతంలోనూ జగన్ తన సొంత సామాజికవర్గానికే పోస్టింగ్‌లు ఇచ్చారన్నారు.

About Author