PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దుర్గ భోగేశ్వరంలో ..కార్తీక మాసం సందడి

1 min read

పల్లెవెలుగు, వెబ్​ గడివేముల: మండలం గడిగరేవుల గ్రామంలో వెలసినటువంటి శ్రీ దుర్గా భోగేశ్వరం స్వామి దేవస్థానంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని క్షేత్రంలో గల పంచామృత కొనేర్లలో స్నానం ఆచరించి స్వామి వారికి అభిషేకాలు,అర్చనలు,ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో మహిళా భక్తులు కార్తీకదీపం వెలిగించి సకల శుభాలు జరగాలని దుర్గా భోగేశ్వరుడిని వేడుకున్నారు. స్వామివారిని స్పెషల్ బ్రాంచ్ సి.ఐ. సూర్యనారాయణ దంపతులు పాల్గొన్నారు.వీరికి ఆలయ ఈఓ,చైర్మెన్ మరియు ధర్మకర్తల మండలి సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వచ్చిన భక్తులకు ఆర్యవైశ్య సత్రం నందు మరియ కాశి రెడ్డి నాయన ఆశ్రమం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈ ఓ చంద్రశేఖర్ రెడ్డి ఆలయ చైర్మన్ రాచమల్లు గోపాలయ్య . ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.

About Author