PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గోరుకల్లులో.. అతిసార..

1 min read
గ్రామంలో చికిత్స చేస్తున్న డా. సృజన, సిబ్బంది

గ్రామంలో చికిత్స చేస్తున్న డా. సృజన, సిబ్బంది

– ఇద్దరు మృతి..? – పలువురికి అస్వస్థత
– ఇంటింటికి వెళ్లి చికిత్సలు అందిస్తున్న వైద్యులు
పల్లెవెలుగువెబ్​, గోరుకల్లు: కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు గ్రామంలో అతిసార విజృంభిస్తోంది. గ్రామంలో కొన్ని రోజులుగా ప్రజలు వాంతులు,విరేచనలతో అస్వస్థతకు గురవుతూనే ఉన్నారు. కొందరు నంద్యాలశాంతి రాం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మరికొందరు హైదరాబాద్​కు తరలివెళ్లినట్టు తెలిసింది. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో కొన్ని రోజులుగా కలుషిత నీరు సరఫరా కావడంతో .. ఆ నీటిని తాగిన ప్రజలు వాంతులు, విరేచనలతో అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే 15 మంది శాంతి రాం ఆస్పత్రిలో చికిత్సపొందుతుండగా కొందరు హైదరాబాద్​కు చికిత్స నిమిత్తం వెళ్లారు. వాంతులు,విరేచనాలో తీవ్రమై ఉప్పరి హుసేన్​ (65), యెల్ల కిట్టయ్య(35) అనే వ్యక్తులు మృతి చెందినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. పరిస్థితి విషమించిందని తెలుసుకున్న వైద్యులు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వైద్యసేవలు అందిస్తున్నారు. గ్రామంలో ఐదు రోజులు మెడికల్​ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ వైద్యాధికారి డా. సృజన తెలిపారు.

About Author