PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆయ‌న అకౌంట్లో రూ. 800 కోట్ల న‌ల్ల‌ధ‌నం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత అనిల్‌ అంబానీ అక్రమంగా విదేశీ బ్యాంకుల్లో దాచిన రూ.800 కోట్ల నల్లధనం గుట్టు రట్టయింది. ఇందుకోసం ఆయన బహమాస్‌, బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో పెట్టిన రెండు డొల్ల కంపెనీల వివరాలూ ఆదాయ పన్ను శాఖకు తెలిసిపోయాయి. దీంతో ఈ నిధుల వివరాలు సమర్పించాలని ఈ ఏడాది మార్చిలో ఐటీ శాఖ.. అనిల్‌ అంబానీకి నోటీసులు జారీ చేసినట్టు ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ తెలిపింది. ఈ రెండు డొల్ల కంపెనీలు స్విట్జర్లాండ్‌, సైప్ర్‌సలోని రెండు బ్యాంకు ఖాతాలకు అంబానీ నిధులు తరలించినట్టు సమాచారం.

                                                        

About Author