NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహానందిలో..ప్రారంభమైన శరన్నవరాత్రోత్సవాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: మహానంది క్షేత్రం లో శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి .ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి మరియు చైర్మన్ కె మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు .క్షేత్రంలో ఉత్సవాల సందర్భంగా ఉదయం నుండి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలను నిర్వహించారు .ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో రుత్వికులు మరియు వేద పండితులు ప్రత్యేక పూజల అనంతరం రుద్ర చండీ హోమం ని చేశారు .పలువురు భక్తులు ఈ హోమం లో పాల్గొన్నారు .సోమవారం నుండి తొమ్మిది రోజులపాటు ప్రత్యేక హోమ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ..ఈ క్షేత్రంలో వెలిసిన శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవారు మొదటిరోజు భక్తులకు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు .పూజా కార్యక్రమాల అనంతరం సోమవారం సాయంత్రం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వృషభ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు .రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామి దర్శనం చేసుకుని గ్రామోత్సవంలో పాల్గొన్నారు.

About Author