PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘మలబార్​’​లో… ఆర్టిస్ర్టీ బ్రాండెడ్​ జ్యువలరీ ప్రదర్శన

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: వాణిజ్యరంగంలో ప్రపంచంలోనే ప్రథమస్థానంలో ఉన్న మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ సంస్థ బంగారు ప్రియుల కోసం ఆర్టిస్ర్టీ బ్రాండెడ్​ జ్యువలరీ షో కార్యక్రమాన్ని నిర్వహించింది. శనివారం కర్నూలు షోరూం హెడ్​ ఫయాజ్​, అసిస్టెంట్​ హెడ్​ చేతన్​ కుమార్​, మార్కెటింగ్​ మేనేజర్​ నూర్​వుల్లా అధ్యక్షతన నిర్వహించిన ఆర్టిస్ర్టీ బ్రాండెడ్​ జ్యువలరీ షో కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు అక్షిత, అమృత, అజిత, ఫాతీమా, శిల్పా ప్రారంభించారు.  షోలో అత్యంత కళానైపుణ్యం… హుందాతనంతో తయారు చేసిన విశిష్ట ఆభరణాలను ప్రదర్శించారు.  అందులో భాగంగా మలబార్​ గోల్డ్​ వారి బ్రాండ్ల సమాహారం ‘మైన్​’ ధ్రువీకరించిన వజ్రాభరణాలు, వివాహం మరియు పార్టీ సంబరాల కోసం  ‘ ఎరా’ అన్కట్​ వజ్రాలతో పొదిగిన విశిష్ట శ్రేణి, ప్రెష్యా జాతిరత్నాభరణాల సముదాయం, ‘ ఎత్నిక్స్​’ హస్తకళా నైపుణ్యతతో తయారైన ఆభరణాలు, ‘ జోల్​’ అధునాతన డిజైన్లతో తేలికపాటి ఆభరణాలను  ఇష్టపడే మగువల మనస్సు దోచుకుంటాయి. ‘డివైన్​’ భారతీయ ప్రాచీన సంప్రదాయం వ్యక్తం చేసే  ఆభరణాలు ఇంకా చిన్నారుల కోసం ‘ స్టార్గెట్​’ పిల్లల  ఆభరణాలు సమకూర్చారు. ఈ ప్రదర్శన మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ కర్నూలు షో రూంలో ఈ నెల 18 నుంచి  26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు స్టోర్​ హెడ్​ ఫయాజ్​ తెలిపారు.

About Author