PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంచాలకట్టలో  గడపగడపకు మన ప్రభుత్వం..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గడివేముల మండల పరిధిలోని మంచాలకట్ట గ్రామంలో ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలను వివరించారు గ్రామంలోని ప్రజలు ఎమ్మెల్యేకు అడుగడుగునా  పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాబోయే ఎన్నికలలో వైసిపి పార్టీని ప్రజలు భారీ మెజార్టీతో  గెలిపించి మళ్లీ మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగమద్దమ్మ, జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి, మండల వైసీపీ కన్వీనర్  శివరామరెడ్డి, వైసీపీ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి, మేఘనాథ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, గనిప్రతాపరెడ్డి, ఎల్లారెడ్డి,కాలు నాయక్ రవీంద్రారెడ్డి, కరిమద్దేల పుల్లయ్య, రఘు మాధవరెడ్డి, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

About Author