PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పీహెచ్​సీలో.. 45 ఏళ్ల వారికి.. టీకా

1 min read

పల్లెవెలుగు వెబ్​, చెన్నూరు : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 45 ఏళ్ల వారికి మొదటి టీకా డోస్​ వేయనున్నట్లు వైద్యాధికారి డా. బి. చెన్నారెడ్డి తెలిపారు. ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చెన్నూర్ తో పాటు మండలంలోని బయనపల్లి , ఉప్పరపల్లి గ్రామ పంచాయతీల లోని సచివాలయ ల లో కూడా అవుతుందన్నారు. ఈ సందర్భంగా డా. చెన్నారెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి సుధాకరరెడ్డి తనిఖీ చేసి ప్రారంభించడం జరిగిందన్నారు. వ్యాక్సిన్​ వేయించుకునే వారు కరోన వైరస్​ జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య విద్యా బోధకుడు కె జయ రాముడు , పంచాయతీ కార్యదర్శి. రామ సుబ్బారెడ్డి, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, పాల్గొన్నారు,

About Author