PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాలనలో.. కొత్త అధ్యాయం

1 min read
ప్రచారం చేస్తున్న మాజీ ఎంపీ బుట్టారేణుక

ప్రచారం చేస్తున్న మాజీ ఎంపీ బుట్టారేణుక

– సామాజిక న్యాయం చేయడం..జగనన్నకే సాధ్యం
– మాజీ ఎంపీ బుట్టారేణుక
పల్లెవెలుగు, కర్నూలు
గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి సీఎం వైఎస్​ జగన్​మోహన్ రెడ్డి చేస్తున్నారని మాజీ ఎంపీ బుట్టా రేణకు అన్నారు. పాలనలో కొత్త అధ్యాయం సృష్టించిన జగనన్న.. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీల కోసం రాష్ట్ర క్యాబినెట్​లో పదువులు ఇవ్వడమేకాకుండా ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి , మహిళలకు 50శాతం మందికి చైర్మన్​ పదవులు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఆదివారం నగరంలోని 44వ వార్డు వైసీపీ అభ్యర్థి రాజేశ్వర రెడ్డిని గెలిపించాలని సీతారాంనగర్​, పంప్​హౌస్​ ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ వార్డులో రోడ్లు, పార్కులు అభివృద్ధి చేయడంలో అభ్యర్థి రాజేశ్వర రెడ్డి పాత్రకీలకమన్నారు. సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తాయన్న ఆమె… రాజేశ్వర రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

About Author