PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శెట్టివీడులో.. జీలగలు పంపిణీ

1 min read

పల్లెవెలుగువెబ్​, చాగలమర్రి: మండలంలోని శెట్టివీడు గ్రామంలోని రైతు భరోసా కేంద్రం వద్ద రైతులకు సబ్సిడీ జీలగలను మండల వ్యవసాయ అధికారిణి నహిదాభాను శుక్రవారం పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలానికి 300 క్వింటాళ్ళ జీలగలు మంజూరయ్యాయన్నారు. క్వింటా ధర రూ. 6390 కాగా రైతులకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ తో రూ 3195/- అందజేస్తుందన్నారు.ఒకరైతుకు ఎకరాకు 10 కిలోల చొప్పున 5 ఎకరాల వరకు 50 కిలోలు అందజేస్తామన్నారు. జీలగలు కావలసిన రైతులు ఆయా సచివాలయ పరధిలోని రైతు భరోసా కేంద్రాలకు తమ పట్టాదారు పాసు పుస్తుకంతో పాటు సెల్‌ పోన్‌ తీసుకెళ్ళి రిజిష్ట్రర్‌ చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో విహెచ్‌ఏ ఉమామహేశ్వరి,రైతులు పాల్గొన్నారు.

About Author