PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏసీబీ వ‌ల‌లో.. ఖాకీ అవినీతి చేప‌లు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : పోలీస్ డిపార్ట్ మెంట్ లోని అవినీతి చేప‌లు ఏసీబీ వ‌ల‌లో ప‌డ్డాయి. లంచం తీసుకుంటూ ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్ ఏసీబీ అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. తూర్పు గోదావ‌రి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఎస్సై ఆనంద్ రెడ్డి, ఏఎస్సై ఇమామ్, కానిస్టేబుల్ మ‌ధు పోలీసుల‌కు చిక్కారు. ఓ కేసు విష‌యంలో పోలీసులు లంచం డిమాండ్ చేయ‌డంతో బాధితుడు ఏసీబీ అధికారుల‌ను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పోలీసుల‌ను అరెస్టు చేసి.. ఏసీబీ కోర్టుకు త‌ర‌లించారు.

About Author