PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమాస్తుల కేసులో.. జ‌గ‌న్ కి చివ‌రి అవ‌కాశం..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: అక్రమాస్తుల కేసులో విచార‌ణ ఎదుర్కొంటున్న జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలన్న ఎంపి ర‌ఘురామ‌కృష్ణరాజు దాఖ‌లు చేసిన పిటిష‌న్ మీద సీబీఐ కోర్టులో విచార‌ణ జ‌రిగింది. కౌంట‌ర్ దాఖ‌లుకు జ‌గ‌న్ త‌ర‌పు న్యాయ‌వాదులు గ‌డువు కోరారు. లాక్ డౌన్ కార‌ణంగా కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌లేక‌పోతున్నామ‌ని జ‌గ‌న్ త‌ర‌పు న్యాయ‌వాదులు సీబీఐ కోర్టుకు తెలిపారు. కౌంట‌ర్ సిద్దంగా ఉంటే ఈమెయిల్ ద్వార అయినా స‌రే.. కోర్టుకు స‌మ‌ర్పంచ‌వ‌చ్చని , ఉద్దేశ‌పూర్వకంగా ర‌ఘురాకృష్ణరాజును వేధిస్తూ జాప్యం చేస్తున్నార‌ని..ర‌ఘురామ త‌ర‌పున్యాయ‌వాది శ్రీ వెంక‌టేశ్ అన్నారు. మ‌రోసారి గ‌డువు ఇవ్వొద్దని , జ‌రిమానా విధించాల‌ని కోర్టును కోరారు. ఇంత వ‌ర‌కు సీబీఐ ఎందుకు కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌డంలేదో అర్థం కాలేద‌ని ఆయ‌న అన్నారు. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న సీబీఐ కోర్టు జ‌గ‌న్ కు , సీబీఐకు చివ‌రి అవ‌కాశం ఇచ్చింది. కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌క‌పోతే నేరుగా విచార‌ణ చేప‌డ‌తామ‌ని కోర్టు స్పష్టం చేసింది. కేసు విచార‌ణ‌ను జూన్ 1కి వాయిదా వేశారు.

About Author