NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విధుల్లోనే కుప్ప కూలిన వెలుగు సీసీ

1 min read

పల్లెవెలుగు వెబ్​ మిడుతూరు: విధులు నిర్వహిస్తూ ఉండగానే గుండెపోటుతో వెలుగు సీసీ ఆర్.నాగేంద్ర కుప్పకూలిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని పైపాలెం గ్రామానికి చెందిన ఆర్.నాగేంద్ర (40)సి.బెళగల్ మండలంలో వెలుగు క్లస్టర్ కోఆర్డినేటర్ గా గత నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు.ప్రతి రోజు స్వగ్రామం నుంచి విధులకు వెళ్లే వాడని శుక్రవారం ఉదయం ఇంటి నుంచి విధులకు వెళ్లాడని బెళగల్ వెలుగు పొదుపు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు నొప్పి వస్తుందని సిబ్బందికి తెలుపగా అక్కడే ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లారు.డాక్టర్ల సూచన మేరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.మృతునికి భార్య లక్ష్మి,శివ(13),ప్రదీప్(8), పార్థసారథి(5)సంతానం ఉన్నారు.కుటుంబ యజమాని మృతి చెందడం పట్ల కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు.ప్రభుత్వం స్పందించి మృతుని భార్య లక్ష్మి కి ఉద్యోగం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

About Author