PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న డాక్టర్ సుధీర్

1 min read

జగనన్న ప్రభుత్వాన్ని దీవించండి..ఆశీర్వదించండి

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: వచ్చే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ ధార సుధీర్ మిడుతూరు మండలంలో దూసుకెళ్తున్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని సోమవారం పీరు సాహెబ్ పేట,గుడిపాడు, 49 బన్నూరు గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ధార సుధీర్ ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మమేకమాయ్యారు. డాక్టర్ సుధీర్ గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు మీ ఓటు వేయాలని కోరుతూ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. మళ్లీ ఆయననే ముఖ్యమంత్రిగా రెండోసారి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎన్నికల్లో నన్ను గెలిపించాలని మహిళలు వృద్ధులు ప్రజలతో ఆయన అన్నారు.మన ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత నాది అని అన్నారు. ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి మళ్ళీ తెచ్చుకుంటే ఇదే పథకాలు మళ్లీ కొనసాగుతాయని జగనన్నను మీరు దీవించాలని మీ పవిత్రమైన అమూల్యమైన ఓటుతో నన్ను గెలిపిస్తే ఎల్లవేళలా నేను మీకు అండగా ఉంటానంటూ ఆయన చేతులు జోడిస్తూ ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు చంద్రశేఖర్ రెడ్డి, మదార్ సాహెబ్,జి.భూదేవి,ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి,జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ జగదీశ్వర్ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి,ఏఎంసీ మాజీ చైర్మన్ తువ్వా చిన్న మల్లారెడ్డి,సహకార సొసైటీ చైర్మన్ నాగ తులసి రెడ్డి,వైస్ ఎంపీపీ టి.నబి రసూల్,యాట ఓబులేష్,మండల కో ఆప్షన్ సభ్యులు పెద్దమౌలా,శ్రీనివాసులు, రామ్మోహన్ రెడ్డి,రవికుమార్ నాయకులు మల్లు శివ నాగిరెడ్డి,పిక్కిలి బలరాముడు,సుదర్శన్ రెడ్డి, శ్రీనివాసులు,హరీష్ సాంబశివుడు,గోపాల్ రెడ్డి సాదిక్ తదితరులు పాల్గొన్నారు.

About Author