PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చివరకు ధర్మమే గెలిచింది…

1 min read

హోళగుంద మండలం టిడిపి నాయకులు…

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హోలగుంద మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ లో మండల కన్వీనర్ డాక్టర్ తిప్పాయ్యా  ఆధ్వర్యంలో* తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రెగ్యులర్ బెయిల్ వచ్చినందువల్ల బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది.టిడిపి నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ జగన్ ఎన్ని కుట్రలు చేసినా న్యాయం వైపే గెలుపు నిలబడుతుంది అని ఇటీవల చంద్రబాబు నాయుడు  ఎటువంటి తప్పు చేయకుండా స్కిల్ స్కాంలో అక్రమంగా ఇరికించి 53 రోజులు కారాగారంలో పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టిన , చంద్రబాబు  స్కామ్ చేశాడని నిరూపించలేకపోయింది జగన్ ప్రభుత్వం అని చెప్పారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గ యువగళం పాదయాత్ర మొదలు పెడతారని ఎప్పటిలాగే ఇప్పుడు కూడా జనాలు తండోలు తండాలుగా బ్రహ్మరథం పడతారని ఖచ్చితంగా 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని చంద్రబాబు నాయుడు  ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేస్తారని ఈ రాక్షస పాలన నుండి రమరాజ్యం తీసుకొస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్యా , మైనార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఆదం, సిబిఎన్ ఆర్మీ మోయిన్, టౌన్ ప్రెసిడెంట్ మల్లికార్జున, సీనియర్ నాయకులు, వందవగిలి శేషప్ప, వెంకోబా, గదిలింగ, జంగల్ రమంజి, శేకర్, ఫక్రుద్దీన్, సురేష్ గౌడ, తిప్పాన్న, జుమ్మ సలీమ్, పీరన్న, మంగయ్య, బీమేష్, ఐటిడిపి తాలూకా కార్యదర్శి హనుమంతు, మండల యూత్ నాయకుడు మంజునాథ్ గౌడ్ మరియు నారా & నందమూరి అభిమానులు పాల్గొనడం జరిగింది.

About Author