PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భవిష్యత్తులో చేనేతలకు వైస్సార్సీపీపార్టీ అండగా ఉంటుంది

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బుధవారం విజయవాడ లో వైస్సార్సీపీ బీసీ ప్రచార కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత విభాగం ట్రైనింగ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వైస్సార్సీపీ రాష్ట్ర బీసీ నాయకులు జాంగా కృష్ణమూర్తి గారు కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు ఈ సందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేత లకు పెద్దపీట వేశారు ప్రతి చేనేత మగ్గానికి 24 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గడప గడపకు ఆత్మీయ పలకరింపు గా వెళ్లి ప్రతి చేనేత ఇంటికి వెళ్ళే గౌరవ ముఖ్యమంత్రి అందిస్తున్న చేయూతను గురించి వివరించాలని భవిష్యత్తులో ఇంకా చేనేతలకు వైస్సార్సీపీపార్టీ అండగా ఉంటుందని ఎంపీ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author