PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌ద్యం పుట్టిన భూమిలో ఇంటింటా మ‌ద్యం పారుతోంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కౌలు రైతు కుటుంబాలకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రూ. లక్ష సాయం చేశారు. ముందుగా జిల్లాలో పులివెందుల నియోజకవర్గం నుంచే చెక్కుల పంపిణీ ప్రారంభించారు. బాధిత కౌలు కుటుంబాలను ఆయన పరామర్శించారు. మూడేళ్లలో ఉమ్మడి జిల్లాలో 173 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 173 మంది కౌలు రైతుల కుటుంబాలకు మొత్తం రూ.1.73 కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జిల్లాలో 173 మంది కౌలు రైతులు చనిపోయారని తెలిపారు. ‘‘సిద్ధులు తిరిగిన ప్రాంతం రాయలసీమ . పేదరికానికి కులం లేదు. బాధిత కౌలు రైతు కుటుంబాల్లో రెడ్లే అధికం. కుల రాజకీయాలకు జనసేన దూరం. 2018లో సీమకు చెందిన అనేకమంది పెద్దలను కలిశాను. నేను ఎప్పుడూ కులమతాల గురించి ఆలోచించను. కౌలు రైతులకు సరిగా గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదు. ఉపాధి లేకుంటే చదువుకున్న యువత ఏం చేయాలి. రాయలసీమ చదువుల నేల.. పద్యం పుట్టిన భూమి. ఇంటింటికీ చీప్‌ లిక్కర్‌ వచ్చిందని యువత చెబుతున్నారు’’ అని పవన్‌ చెప్పారు.

                                

About Author