PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గడివేములలో… అ ‘పూర్వ’ సమ్మేళనం..

1 min read

పల్లెవెలుగు వెబ్​, గడివేముల: మండల కేంద్రమైన గడివేముల  జిల్లా పరిషత్ పాఠశాలలో లో 1993  నుండి1998 పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. గడివేముల మండలం పాత బస్టాండ్ కూడలి నుండి  జిల్లా పరిషత్ పాఠశాల వరకు విద్యార్థులు గురువులను మేళతాళాలతో ఆహ్వానించారు. అనంతరం వేదికపై ఒక బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ గురువుతో పరిచయాలు గత తీపి మధుర   సన్నివేశాలు చిలిపి గుర్తులు చేసుకున్నారు. ఆత్మీయ సన్మాన సభలో గురువులకు  ఘనంగా శాలువాలు, పూలమాలలతో సన్మానించారు.  

కార్యక్రమంలో విద్యార్థులు మాట్లాడుతూ 23 సంవత్సరాల తర్వాత అందరూ కలవడం  చాలా ఆనందంగా ఉందని విద్యార్థులు మరియు గురువులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గురువులు కృష్ణమూర్తి జయమ్మ సుబ్బరామయ్య కాసిం షంషేర్ ముర్తుజావలి సర్దార్ హుస్సేన్ పిచ్చి రెడ్డి సిద్ధారెడ్డి పాల్గొన్నారు.

About Author