NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మల్లన్న సన్నిధిలో.. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ దంపతులు

1 min read

పల్లెవెలుగు వెబ్​:  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను సోమవారం తెల్లవారు జామున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ దంపతులు దర్శించుకున్నారు.  ఈఓ లవన్న రాజగోపురం వద్ద మంగళవాయిద్యాలతో అర్చక స్వాములు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ దంపతులు రత్నగర్భ గణపతి పూజ, శ్రీ మల్లికార్జున స్వామి వారి సుప్రభాత సేవ, మహా మంగళ హారతి కార్యక్రమంలో పాల్గొని, గర్భగుడిలోని మూలవిరాట్ కు మహాన్యాస రుద్రాభిషేకం చేసారు. అనంతరం శ్రీ భ్రమరాంబ అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు వేద పండితుల నుండి ఆశీర్వచనం తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఎన్వి రమణ దంపతులకు శ్రీస్వామి అమ్మవార్ల జ్ఞాపికను ఈవో లవన్న అందజేశారు.

About Author