NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్ వి దంపతుల సమక్షంలో టిడిపి వీడి.. వైసీపీలో చేరిక

1 min read

– కర్నూల్ కొండారెడ్డి బురుజు పై వైస్సార్సీపీ జెండా రెప రెప లాడాలి

– శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి  .. మాజీ ఎమ్మెల్యే

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి , శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి  సమక్షంలో  శ్రీ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో 44వ వార్డు వెంకట రమణ కాలనీ నుంచి తెలుగుదేశం పార్టీ నగర మహిళా కార్యదర్శి శ్రీమతి చంద్ర కళ బాయ్ మరియు ఉపాధ్యక్షులు శ్రీమతి ఆశాలత,టీడీపీ నాయకులు వినయ్ బాబు లు 300 మందికి పైగా వైస్సార్సీపీ పార్టీ లో చేరారు. వారికీ ఎస్ వి దంపతులు పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నగరం లో 2024 లో వైస్సార్సీపీ గెలుపు తథ్యం అని పార్టీ జెండా తాము కొండారెడ్డి బురుజు పై ఏగుర వేస్తాం అని తెలిపారు. చంద్ర కళా బాయ్ మాట్లాడుతూ కార్యకర్తల విలువ తెలిసిన అసలైన నాయకులు ఎస్ వి మోహన్ రెడ్డి గారే అని అయన ఆధ్వర్యంలో పార్టీ లో కొనసాగుతా మని తెలిపారు. కార్యక్రమం లో వైస్సార్సీపీ సీనియర్ నాయకులు మరియు మహిళా నాయకులు భారీ సంఖ్య లో పాల్గొన్నారు.

About Author