PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్ వి దంపతుల సమక్షంలో వైస్సార్సీపీ పార్టీ లోకి భారీగా చేరికలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   మాజీ ఎమ్మెల్యే    ప్రజా నేత శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి గారు మరియు కర్నూలు ఆత్మీయ సోదరి శ్రీ ఎస్ వి విజయ మనోహరి గార్ల ఆధ్వర్యంలో నగరం లోని 49 వ వార్డ్ కు చెందిన కల్లా నరసింహ రెడ్డి మరియు కల్లా నాగవేణి రెడ్డి లు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ శ్రీ రాఘవేంద్ర నాయుడు  ఆధ్వర్యంలో   దాదాపు 2000 వేల మంది వైస్సార్సీపీ పార్టీ లో చేరారు. వారికీ ఎస్ వి దంపతులు పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. అంతకు ముందు N R పేట మథర్ థెరిస్సా సర్కిల్ నుంచి మున్సిపల్ ఆఫీస్ మీదుగా ఎస్ వి కాంప్లెక్స్ సర్కిల్ లోని మహానేత దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఎస్ వి మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ జగన్నన్న ప్రజా బందు అని పేద వారికీ మంచి చేసి వారి భవిష్యత్ ను మార్చాలి అనే గొప్ప ఆశయం కలవారు అని అందుకే నగరం లో అనేకమంది తమ ఆధ్వర్యంలో వైస్సార్సీపీ లో చేరుతున్నారు అని, వైస్సార్సీపీ పార్టీ కి నగరం లో తిరుగు  లేని శక్తి గా తయారు చేయడం తమ ముందున్న కర్తవ్యం అని తెలియ చేసారు. శ్రీమతి కె నాగవేణి గారు మాట్లాడుతూ నగరం లో అభివృద్ధి ఒక్క ఎస్ వి మోహన్ రెడ్డి గారి ద్వారా నే సాధ్యం అని, పిలిస్తే పలికే మరియు కార్యకర్తల కు నిత్యం అందుబాటులో ఉండే ఎస్ వి దంపతుల నెత్రుత్వం లో జగన్నన్న మల్లి ముఖ్య మంత్రిని చేయడం కొఱకు తాము కృషి చేస్తాం అని తెలిపారు కార్యక్రమం లో వైస్సార్సీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

About Author