PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జర్నలిస్ట్‌ పాత్రలో..

1 min read

సినిమా డెస్క్​ : బబ్లీ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి బ్యాగ్‌లో మరో సినిమా యాడ్‌ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంచు వారి హీరో మనోజ్‌ ‘అహం బ్రహ్మస్మి’ మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మనోజ్‌కి జోడీగా లావణ్య నటించనుందట. ఆమెది జర్నలిస్ట్ పాత్ర అని, కథలో ఎంతో కీలకమైన రోల్‌ అని అంటున్నారు. సినిమాలో సెకండ్ హాఫ్‌ నుంచి లావణ్య ఎంటరవుతుందట. గుమ్మంకొండ కార్తికేయ సినిమా ‘చావుకబురు చల్లగా’లో నర్స్‌ మల్లికగా నటించి కుర్రకారుని అలరించిన లావణ్య ఇప్పుడు జర్నలిస్ట్‌ లాంటి సీరియస్‌ పాత్రలో నటించనుంది. ఈ సినిమా కోసం ‘ఎమ్ఎమ్‌ ఆర్ట్స్‌’ పేరుతో మంచు మనోజ్ సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.


About Author