PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గవర్నమెంట్‌ ఎంప్లాయీ పాత్రలో..

1 min read

పల్లెవెలుగు వెబ్​: ‘క్రాక్’ లాంటి బ్లాక్ బస్టర్‌‌తో తిరిగి ఫాంలోకి వచ్చాడు రవితేజ. ఇప్పడు వరుస సినిమాలను లైన్‌లో పెట్టేస్తున్నారు. ఓ వైపు రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా చేస్తున్న ఆయన, తాజాగా తన కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకుడు. రవితేజ కెరీర్ లో ఇది 68వ చిత్రం. ఉగాది రోజున ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగును నిన్న హైదరాబాద్ లో మొదలుపెట్టారు.. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ అభిమానుల్లో క్యూరియాసిటీని కలిగిస్తోంది. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆఫీస్ ముందు కూర్చుని రవితేజ ఏదో టైప్ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారిగా ప్రమాణ స్వీకారం చేసిన లెటర్, టేబుల్‌పై టైప్ రైటర్, పైల్స్ లాంటివి పోస్టర్ లో కనిపిస్తున్నాయి. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా యూనిక్ థ్రిల్లర్ రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజని ఇంతకు చూడని ఓ కొత్త కోణంలో చూపించబోతున్నాడట దర్శకుడు శరత్. ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. నాజర్, నరేష్, పవిత్రా లోకేష్, రాహుల్ రామకృష్ణ, సురేఖవాణి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సామ్ పీఎస్ సంగీతం, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘ఎమ్మార్వో’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు టాక్. ఇంచుమించు పోస్టర్ అలాగే ఉండటంతో ఈ వార్తలకి మరింత బలాన్నిస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలోనూ రవితేజ ఓ చిత్రంలో నటించబోతున్నారు.

About Author