PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివేకా హ‌త్య కుట్ర‌లో.. శివ‌శంక‌ర్ రెడ్డి ప్ర‌ధాన భాగ‌స్వామి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కుట్ర కేసులో శివ‌శంక‌ర్ రెడ్డి ప్ర‌ధాన భాగ‌స్వామి అని సీబీఐ తేల్చింది. గుండెపోటుతో చనిపోయార‌ని ప్ర‌చారం చేసిన వారిలో దేవిరెడ్డి శివ‌శంక‌ర్ రెడ్డి ముఖ్య‌మైన వ్య‌క్తి అని పేర్కొంది. అదే విష‌యాన్ని సాక్షి టీవికి కూడ చెప్పార‌ని పేర్కొంది. వివేకా గుండెపోటుతో చ‌నిపోయార‌ని న‌మ్మించేందుకు ర‌క్త‌పుమ‌ర‌క‌లన్ని తుడిపించేసి, ఘ‌ట‌న‌కు సంబంధించిన ఆధారాల్ని ద్వంసం చేశార‌ని వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలోనే గ‌జ్జ‌ల జై ప్ర‌కాష్ రెడ్డి అనే కాంపౌండ‌ర్ తో క‌ట్లుక‌ట్టించి బ్యాండేజీ వేయించార‌ని తెలిపింది. బెయిల్ కోసం శివ‌శంక‌ర్ రెడ్డి న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌గా ఆ పిటిష‌న్ ను న్యాయ‌మూర్తి కొట్టేశారు. సీబీఐ త‌మ ద‌ర్యాప్తులో వెలుగు చూసిన కీల‌క అంశాల్ని న్యాయ‌స్థానం ముందు ఉంచింది.

                             

About Author