NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉక్రెయిన్ లో.. తుదిశ్వాస విడిచిన మ‌రో భార‌త విద్యార్థి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్ లో చిక్కుకున్న మరో భారతీయ విద్యార్థి చందన్ జిందాల్ బుధవారం ప్రాణాలు కోల్పోయారు. ఆయన పంజాబ్‌లోని బర్నాలాకు చెందినవారని, వినిట్సియాలోని నేషనల్ పైరోగోవ్ మెమోరియల్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నారని తెలుస్తోంది. అత‌ని వ‌య‌సు 22 ఏళ్లు. ఇషెమిక్ స్ట్రోక్‌తో బాధపడుతున్న జిందాల్‌ను వినిట్సియాలోని కీవ్‌స్కా వీథి-68లో ఉన్న ఎమర్జెన్సీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపిస్తున్నారు. ఆయన తండ్రి భారత ప్రభుత్వానికి రాసిన లేఖలో తమ కుమారుని మృతదేహాన్ని రప్పించేందుకు సాయం చేయాలని కోరారు.

                                         

About Author