PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వనిపెంటలో… భార్యపై కత్తితో దాడి..

1 min read

పల్లెవెలుగు వెబ్​, చాగలమర్రి: మండలం లోని డి వనిపెంట గ్రామానికి చెందిన తులశమ్మ ను  భర్త సుధాకర్ కత్తి తో దాడి చేసి గాయపర్చినట్లు ఎస్ఐ రమణయ్య శనివారం  తెలిపారు. పోలీసులు,బాధితురాలు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన సుధాకర్ కు వైఎస్ఆర్ జిల్లా గుంటూరు పల్లె గ్రామానికి చెందిన తులశమ్మతో 20 ఏళ్లు కిందట వివాహాం జరిగింది . వీరికి ఒక కుమార్తె , కుమారుడు ఉన్నారు . గత మూడు సంవత్సరాల నుండి సుధాకర్‌  మద్యానికి బానిసై బార్యతో పాటు పిల్లలను వేధించేవాడు . ఈ నేపద్యంలో ఈనెల 18 వ తేదిన రాత్రి మద్యం సేవించి ఇంటి వచ్చి భార్య ను నానా దుర్భాషలాడుతూ కత్తితో దాడి చేయ్యడంతో చేతి వేళ్లుకు తీవ్ర గాయాలయ్యాయి . వెంటనే కుటుంబీకులు చికిత్స నిమిత్తం స్థానిక కేరళా వైద్యశాలకు తరలించారు . ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నంద్యాల వైద్యశాలకు తరలించారు . బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.

About Author