PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సావిత్రిబాయిపూలే జ్యోతిరావుపూలే విగ్రహాల ఆవిష్కరణ..

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్ల లోని గంజహళ్లి గ్రామంలో బిసి విద్యార్థి సంఘం వీర నాయుడు,పోతులపాడు నాగరాజు అధ్యక్షతన గ్రామంలోని ప్రాథమిక పాఠశాల నందు మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రి బాయిపూలే ల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహింఛారు. ఈ కార్యక్రమానికి మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి, బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మహాత్మ జ్యోతిబాపూలే సావిత్రి బాయిపులే విగ్రహాల దాత నక్కలమిట్ట శ్రీనివాసులు, మైనార్టీ నాయకుల అన్వర్ హుస్సేన్,కరుణాకర్, ప్రసాద్,వెంకట్,గ్రామ సర్పంచ్ రాముడు, పాల్గొన్నారు. నక్కలమిట్ట శ్రీనివాసులు మహాత్మ జ్యోతిబాపూలే సావిత్రిబాయిపూలే ల విగ్రహాలను ఆవిష్కరింఛారు. అనంతరం మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది.విజయలక్ష్మి రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజు నాయుడు రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి రవీంద్రనాథ్ మాట్లాడుతూ విద్యార్థులు సావిత్రి బాయిపూలే జ్యోతిబా పూలే ల అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆలోచన విధానంతో ముందుకు వెళ్లాలని ఆమె తెలిపారు. విగ్రహ దాత నక్కల మిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావుపూలే సావిత్రిబాయిపూలే విగ్రహాలను ఆవిష్కరించడం ఆనందించదగ్గ మంచి కార్యక్రమమని, విద్యార్థులు పూలే ఆలోచనలతో ఆ మహనీయుల అడుగు జాడల్లో నడిచి వారి భవిష్యత్తుని ఉన్నతంగా మార్చుకోవాలని ఆయన అన్నారు. ఆ మహనీయుల త్యాగాలను స్మరించుకుని ఆ స్ఫూర్తితో ప్రతి బహుజన బిడ్డ మరియు విద్యార్థులు ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రములో డీలర్ రంగారెడ్డి తిరుమల రెడ్డి స్కూల్ చైర్మన్ విజయ్ ప్రహ్లాద లింగన్న నర్సింహులు వీరేష్ పూర్ణ మహిళా ఐక్య వేదిక భారతమ్మ,ఖాసీం బీ, స్కూలు శివ శంకర్ బీసీ యూవజన సంఘం రామకృష్ణ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

About Author