PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతనంగా సచివాలయం… వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ల ప్రారంభోత్సవం

1 min read

మసీదుపురంలో వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్, సచివాలయం కొత్త భవనాలు ప్రారంభించిన : ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక

పల్లెవెలుగు వెబ్  ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు మండల పరిధిలోని మసీదుపురం గ్రామంలో నూతనంగా సచివాలయం, వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి” , సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక , ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి”  మాట్లాడుతూ పట్టణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త భవనాలను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఉన్న యూహెచ్‌సీ భవనాలకు మెరుగులు దిద్దడంతో పాటు కొత్త సెంటర్ల ఏర్పాటు కోసం భవనాలను నిర్మిస్తోంది అని అన్నారు. ఈకార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు అభిమానులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author