PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అశేష హిందూ సమాజాన్ని వీహెచ్​పి (సభ్యులు)గా చేర్చండి

1 min read

– విశ్వహిందూపరిషత్ రాష్ట్ర కార్యదర్శి కాకర్ల రాముడు
పల్లెవెలుగు ,వెబ్​ కర్నూలు: మూడు సం.ల కు ఒకసారి నిర్వహించే విశ్వహిందూ పరిషత్ ” హితచింతక్ అభియాన్” సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈసారి పెద్ద ఎత్తున నిర్వహించాలని అందుకోసం కర్నూలు జిల్లా లోని అన్ని గ్రామాల్లో,నగర కేంద్రాల్లోని బస్తీల్లో నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ రెండురోజుల ” శిక్షణా కార్యక్రమం” ముగింపు సభలో పిలుపునిచ్చారు.ఇంకా మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని అన్ని రెవెన్యూ మండల కేంద్రాలను యూనిట్ గా చేసుకుని గ్రామ గ్రామాన ఈ హితచింతక్ అభియాన్(విశ్వహిందూ పరిషత్ సభ్యత్వ నమోదు) కార్యక్రమం నిర్వహించాలన్నారు,మరో ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ ఈ రెండు రోజుల శిక్షణా శిబిరంలో శిక్షణ పొందిన కార్యకర్తలందరూ తమతమ కార్యక్షేత్రాలలో వెళ్ళి పరిషత్ కార్యాన్ని విస్తరించాలనీ,ఇక్కడ నేర్చుకున్న వివిధ విషయాలను గుర్తుంచుకునిరాబోయే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలనితెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి సందడి మహేశ్వర్,విభాగ్ ధర్మప్రసార్ కన్వీనర్ విజయుడు,సేవా కన్వీనర్ గురుమూర్తి,జిల్లా అధ్యక్షులు గోరంట్లరమణ,ఉపాధ్యక్షులు లక్కిరెడ్డి అమరసింహారెడ్డి, వాసుదేవయ్య,కార్యదర్శిమాళిగిభానుప్రకాష్,కోశాధికారి అయోధ్య శ్రీనివాసరెడ్డి,సంఘటనా కార్యదర్శి భూపాలాచారి, నగర అధ్యక్షులు పి.సీ.మద్దిలేటి, ఉపాధ్యక్షులు కృష్ణపరమాత్మ, కార్యదర్శి ఈపూరి నాగరాజు,శేఖర్ గుప్త తదితరులు పాల్గొన్నారు.

About Author